ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై లెక్కలు చెప్పాలి.

👉 CFMS వ్యవస్థ వల్లే ఉద్యోగులకి దుస్థితి... ట్రెజరీ వ్యవస్థను బలోపేతం చేయాలి... ఉద్యోగులకు సియఫ్ యంయస్ పై నమ్మకం లేదు"..  

ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు bopparaju గారు అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా bopparaju గారు మాట్లాడుతూ...
 రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులంతా ప్రభుత్వంలో బాగస్వామ్యమే అంటున్నప్పుడు ప్రభుత్వఉద్యోగులకు చెల్లించాల్సిబకాయిలపై లెక్కలు చెప్పాల్సిన బాద్యత ఉన్నప్పటికీ ఎందుకు బకాయిలపై లెక్కలు చెప్పడంలేదో ఇందులో ఏమీ రహస్యలు దాగి ఉన్నాయో ఉద్యోగులకు అర్దం కావడం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగులకు సంబందించిన డబ్బులు ఎంతవాడుకున్నారు, ఇంతవరకు ఎంత చెల్లించారో చెప్పాలి. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయోకూడా ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుదవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేసారు.

  అలాగే ఉద్యోగులకు CFMS వ్యవస్దవల్లనే ఈదుస్దితి వస్తుందని కావున గతంలో మాదిరిగా ట్రజరీల వ్యవస్ధను బలోపేతం చేయాలని బొప్పరాజు డిమాండ్ చేసారు