ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకునే విధంగా ప్రస్తుత పరిస్థితులను ఉద్యోగులకు అనుకూలంగా మలుచుకోవడానికి కావలసిన ఈ విధంగా ప్రయత్నం చేయటానికి గాను ఏపీ జేఏసీ అమరావతి ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించాలని సర్క్యులర్ విడుదల చేసింది. ది. 28.11.2021 (ఆదివారం) ఉదయం 10.00 గంటలకు విజయవాడ, గవర్నర్పేటలోని రెవెన్యూ భవన్లో మీటింగ్ జరపడానికి ప్రణాళిక చేసింది.
ఈ క్రింది ఎజెండా అంశాలపై చర్చించేందుకు AP JAC అమరావతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడమైనది..
1. తక్షణమే 11వ పిఆర్సి అమలు గురించి చర్చించడం.
2. AP JAC & AP JAC Amaraavthi లు సంయుక్తంగా నివేదించిన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం; CPS రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల హెల్త్ కార్డ్ల అమలు, కారుణ్య నియామకాలు మొదలైనవి.
3. 2020-21 & 2021-22 సంవత్సరానికి ఏపీ జేఏసీ అమరావతి మెంబర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించ టానికి సిద్ధపడి రావాలని సూచించారు.
4. కుర్చీ అనుమతితో ఏదైనా ఇతర అంశాలు.
AP JAC అమరావతి అన్ని జిల్లాల చైర్మన్లు/ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు మరియు సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు అందరూ తప్పకుండా ఉదయం 10.00 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తెలియచేసారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు (అధ్యక్షుడు)
AP JAC అమరావతి
Note: ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాలుగా ఉన్నా నాయకులు అందరూ కూడా ఏపీ జేఏసీ అమరావతి లో మీ యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ మీ మినిట్స్ బుక్ లో రాసుకున్న మినిట్స్ యొక్క కాపీని కచ్చితంగా రేపు 28వ తారీఖున జరిగే మీటింగుకు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము.

0 Comments
Thanks For Your Valuable Feed Back