పదోన్నతులే పనిష్మెంటాయే - రెవిన్యూ ఉద్యోగుల
ఆవేదన
6 మాసాల నుండి జీతాలు లేక సతమతమవుతున్న 167 మంది తహశీల్దార్లు.
183 మంది ఇతర రెవెన్యూ ఉద్యోగుల కూడా అందని జీతాలు
***
గత సంవత్సరము 2020 అక్టోబర్ మాసములో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) గారు తహసీల్దార్ల పదోన్నతులకు సంబంధించి శాఖాపరమైన పదోన్నతులు కమిటీ (డీ.పీ.సి) జరిపి 167 మంది తహసీల్దార్లను వారి వారి జిల్లాలలో ఖాళీగా వున్నా స్థానాలలో వారిని నియమించమని జిల్లా కలెక్టర్లను ఆదేశించగా, అందరు జిల్లా కలెక్టర్లు దానికి విరుద్ధముగా బదిలీలపై నిషేధము ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిడితో మరియు వారి స్వంత నిర్ణయాలతో 167 మంది తహసీల్దారులను, వారితో పాటు 183 మంది ఇతర రెవిన్యూ సిబ్బందిని బదిలీలు చేసారు.
◆ బదిలీలపై నిషేధము వున్న కారణంగా వీరి జీతభత్యాలు నిలిపివేయడము వలన గత 6 మాసముల నుండి వీరందరికి జీతభత్యాలు అందక,కరోనా నుండి బయటపడి సంక్రాంతి కుటుంబసభ్యులతో సంబరంగా జరుపుకోలేక నరకయాతన అనుభవిస్తూ చివరకు ఉగాది పండుగ జరుపుకోవడానికి,కుటుంబ నెలవారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితులలో నేడు రెవిన్యూ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.
◆ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం అడ్డగోలుగా బదిలీ చేసిన అధికారుల జీతాలు నిలపివేయాలి. కానీ, బదిలీలు చేసిన కలెక్టర్లు మాకు సంబంధం లేనట్లు మిన్నకుండిపోయారు..వారిపై చర్యలు తీసుకోవాలిసిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోగా బదిలీ కాబడిన *167 మంది తహశీల్దార్లకు* , వారి పదోన్నతులు సందర్భంగా జరిగిన ఇతర రెవెన్యూ ఉద్యోగులు అనగా *32 మంది Dy. తహసీల్దార్లు* , *138 మంది SA/RI లు* , *10 మంది జూనియర్ సహాయకులు* , *ముగ్గురు డ్రైవర్లు* *వెరసి 350 మంది రెవెన్యూ ఉద్యోగులకు గత 2020 సంవత్సరం అక్టోబర్ నుండి* జీతాలు చెల్లింపు కొరకు నేటికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ ఎలాంటి తప్పు చేయని రెవిన్యూ ఉద్యోగులు మాత్రం గత 6 మాసాల నుండి జీతభత్యాలు అందక బలిపశువులయ్యారు.
◆ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి అనేకసార్లు APRSA పక్షాన తీసుకెళ్లినా ఇంకా కాలయాపన తప్ప, ఉపశమన చర్యలు శూన్యము. నెలలు గడుస్తున్నా, సంబంధిత ఫైలు గౌ||ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందాల్సి ఉందని బదిలీ చేసిన 6 మాసాల తర్వాత కూడా ఉన్నతాధికారులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
★ కావున, తక్షణమే గౌ|| ముఖ్యమంత్రి గారు కలుగచేసుకుని, "ఒకవైపు పని ఒత్తిడి, మరో వైపు ప్రభుత్వం చెప్పిన పనులకు నిధులు లేక అప్పులు తెచ్చి మానసిక ఒత్తిడి కి గురి అవుతున్న 167 మంది తహశీల్దార్లకు, వారి పదోన్నతులు సందర్భంగా జరిగిన *183 మంది ఇతర రెవెన్యూ ఉద్యోగుల జీతభత్యాలు* తెలుగు సంవత్సరాది *ఉగాది పండుగ రోజుకైనా (నిలిచిపోయిన 6 మాసాల జీతభత్యాలు) వెంటనే చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన కోరుతున్నాము.*
*బొప్పరాజు*
*చేబ్రోలు కృష్ణమూర్తి*
*V. గిరి కుమార్ రెడ్డి.*
0 Comments
Thanks For Your Valuable Feed Back