బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రి.నెంబర్ _1681/2006_ డైరీ ఆవిష్కరణ. 

 విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు _శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి_ గారి చేతులు మీదగా డైరీ ఆవిష్కరణ. 

 ఈ రోజు బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రి.నెంబర్ _1681/2006_ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం,  విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు _శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి_ గారి చేతులు మీదగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మన  CPDCL సీఎండీ శ్రీ పద్మజనార్ధన రెడ్డి గారు, APJAC అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, APJAC అమరావతి సెక్రటరీ జనరల్,  శ్రీ వైవీ రావు గారు, విద్యుత్ బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరిశ వెంకటేశ్వరావు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జే.సురేష్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ ఉపేంద్రo శ్రీనివాసులు గారు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వి.గుణ వంతుడు గారు, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ డివి రమణ గారు, AP TRANSCO  ప్రెసిడెంట్ శ్రీ ఏం.భాస్కర్ గారు, AP TRANSCO సెక్రటరీ బి.సురేష్ గారు AP GENCO ప్రెసిడెంట్ జి.వెంకట సుబ్బయ్య గారు AP GENCO సెక్రటరీ పి.సతీష్ కుమార్ గారు, APEPDCL జి. yaneswara rao గారు APEPDCL శ్రీ ఏం.ధర్మరాజు గారు APSPDCL ప్రెసిడెంట్ శ్రీ బి.సుబ్రహ్మణ్యం గారు, APSPDCL సెక్రటరీ శ్రీ  పి.వి.రామరాజు APCPDCL ప్రెసిడెంట్ శ్రీ నరసింహారావు గారు, APCPDCL సెక్రటరీ ఏ.సత్యనారాయణ గారు  పాల్గొనడం జరిగింది మరియు రాష్ట్ర నలుమూలల నుండి విద్యుత్ బిసి ఉద్యోగులు,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. 
   ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖను ప్రవేటికరించే ప్రసక్తే లేదని, రావలసిన బకాయిలను త్వరలోనే పరిష్కరిస్తామని, వేరే అపోహలకు విద్యుత్ ఉద్యోగులు వెళ్లవద్దని తెలిపారు.    
అదేవిధంగా బీసీ ఉద్యోగుల సమస్యలని మంత్రి గారి దృష్టికి తీసుకువెల్లగా, మంత్రిగారు సానుకూలంగా స్పందిస్తూ CMD గారితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియచేశారు. 
తదుపరి మంత్రిగారిని వెంకటేశ్వర స్వామి మెమెంటో అందచేయడo జరిగిoది.