బొప్పరాజు గారి మాటల్లో
APNGO's రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల శ్రేయస్సు కొరకు, వారికి రావలసిన రాయితీల కొరకు పోరాటం చేస్తూ పోరాటం మధ్యలోనే అశువులుబాసిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర నాయకత్వం అలాగే ఏపీ జేఏసి అమరావతి రాష్ర నాయకత్వం నెల్లూరు పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ. వారి ఆశయాలను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు కోనసాగిస్తుంది అని ఉద్యోగులకు రావలసిన రాయితీల కోసం అవసరమైతే పోరాటం చేసి తీరతామని తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడి ఇంత పెద్ద కరోనా విపత్తులో కూడా ముందుండి ప్రైవేట్ హెల్త్ సెక్టార్ భయపడి ప్రక్కన ఉన్నాకూడా గవర్నమెంట్ సెక్టార్లో ప్రత్యేకంగా వైద్యులు అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అదేవిధంగా నర్సులు అందరూ కూడా కష్టపడి అలాగే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖలు ముందుండి ఈరోజు ఈ యొక్క విపత్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎదుర్కొంటుంది. అటువంటి ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకి రావలసిన రాయతీల గురించి మాకు రెగ్యులర్ రావలసిన జీతభత్యాల్లో ఏప్రిల్ మే నెలలో నిలిపివేసిన 15 రోజుల 15 రోజుల జీతం వెరసి నెల రోజుల జీతం వెంటనే చెల్లించాలని. 2018 జూలై నుంచి రావలసిన DAల బకాయిలలో కనీసం పాత మూడు బకాయిల DAలను అయినా చెల్లించడానికి ముఖ్యమంత్రివర్యులు చొరవ చూపి చెల్లించాలని, అదేవిధంగా PRC 11వ పిఆర్సి నివేదికకు ఇచ్చిన గడువు ఈనెలాఖరుకు పూర్తి అవుతున్న సందర్భంగా నివేదిక తెప్పించుకొని దానిని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాము.
0 Comments
Thanks For Your Valuable Feed Back